బాలనురా మదనా
చిత్రం : మిస్సమ్మ (1955)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : పింగళి నాగేంద్రరావు
నేపధ్య గానం : సుశీల
పల్లవి:
బాలనురా... మదనా...
బాలనురా... మదనా...
విరి తూపులు వేయకురా...
మదనా...
బాలను రా... మదనా...
చరణం 1:
నిలచిన చోటనే నిలువగ నీయక ఆ..
నిలచిన చోటనే నిలువగ నీయక
వలపులు కురియును రా
తీయని తలపులు విరియును రా..
మదనా
బాలనురా... మదనా...
విరి తూపులు వేయకురా...
మదనా...
బాలను రా... మదనా..
చరణం 2:
చిలుకల వలే గోర్వంకల వలెనో ఓ..
చిలుకల వలే గోర్వంకల వలెనో
కులుకగ తోచును రా...
తనువున పులకలు కలుగును రా...
మదనా...
బాలనురా... మదనా...
విరి తూపులు వేయకురా...
మదనా...
బాలను రా... మదనా..
చరణం 3:
చిలిపి కోయిలలు చిత్తములో నే..ఏ..ఏ
చిలిపి కోయిలలు చిత్తములో నే
కలకల కూయును రా
మనసును కలవర పరచును రా..
మదనా
బాలనురా... మదనా...
విరి తూపులు వేయకురా...
మదనా...
బాలను రా... మదనా..
- పాటల ధనుస్సు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి