బృందావనమది అందరిది
చిత్రం : మిస్సమ్మ (1955)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : పింగళి నాగేంద్రరావు
నేపధ్య గానం : ఏ. ఎం. రాజా, సుశీల
పల్లవి:
బృందావనమది అందరిది..
గోవిందుడు అందరి వాడేలే
బృందావనమది అందరిది..
గోవిందుడు అందరి వాడేలే
ఎందుకే రాధా ఈశునసూయలు..
అందములందరి ఆనందములే
ఎందుకే రాధా ఈశునసూయలు..
అందములందరి ఆనందములే
బృందావనమది అందరిది..
గోవిందుడు అందరి వాడేలే
చరణం 1:
పిల్లన గ్రోవిని పిలుపులు వింటె..
ఉల్లము ఝల్లున పొంగదటే
పిల్లన గ్రోవిని పిలుపులు వింటె..
ఉల్లము ఝల్లున పొంగదటే
రాగములో అనురాగము చిందిన
జగమే ఊయలలూగదటే
రాగములో అనురాగము చిందిన
జగమే ఊయలలూగదటే
బృందావనమది అందరిది..
గోవిందుడు అందరి వాడేలే
చరణం 2:
రాసక్రీడల రమణుని గాంచిన
ఆశలు మోశులు వేయవటే
రాసక్రీడల రమణుని గాంచిన
ఆశలు మోశులు వేయవటే
ఎందుకే రాధా ఈశునుసూయలు..
అందములందరి ఆనందములే..
బృందావనమది అందరిది..
గోవిందుడు అందరి వాడేలే
గోవిందుడు అందరి వాడేలే..
- పాటల ధనుస్సు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి