చిగురులు వేసిన కలలన్ని
చిత్రం : పూల రంగడు (1967)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : కె. బి. మోహన్ రాజు, పి.సుశీల
పల్లవి:
చిగురులు వేసిన కలలన్ని..
సిగలో పూలుగ మారినవి
మనసున పొంగిన అలలన్నీ..
మమతల తీరం చేరినవి..
మమతల తీరంచేరినవి..
ఆ.ఆ.ఓ...ఓ...ఓ
చరణం 1:
సన్నజాజి తీగలాగ
నిన్ను చేరుకున్నానూ..ఊ..
సన్నజాజి తీగలాగ
నిన్ను చేరుకున్నాను
నిండు మనసు పందిరి కాగా ...
నిన్ను అందుకున్నాను..
నిన్నే అందుకున్నాను...
చిగురులు వేసిన కలలన్ని..
సిగలో పూలుగ మారినవి
చరణం 2:
దాగలేని రాగాలేవో
దాచినావు ఆనాడు
దాగలేని రాగాలేవో
దాచినావు ఆనాడు
నా తనువు అణువణువు..
నీదే నీదే ఈనాడు..
నీదే నీదే ఏనాడు...
చిగురులు వేసిన కలలన్ని..
సిగలో పూలుగ మారినవి
చరణం 3:
నీటిలోని కలువను కోరి
నింగి దిగిన జాబిలి నీవే..ఏ..
నీటిలోని కలువను కోరి
నింగి దిగిన జాబిలి నీవే
పరిమళాల తరగలలోనే..ఏ...ఆ ఆ ఆ...
పరిమళాల తరగలలోనే...
కరిగించిన చెలియవు నీవే..
కరగించిన చెలియవు నీవే
చిగురులు వేసిన కలలన్ని..
సిగలో పూలుగ మారినవి
మనసున పొంగిన అలలన్నీ..
మమతల తీరం చేరినవి..
మమతల తీరంచేరినవి..
ఆ.ఆ.ఓ...ఓ...ఓ
- పాటల ధనుస్సు









