నా మాటే నీ మాటై చదవాలీ
చిత్రం : మట్టిలో మాణిక్యం (1971)
సంగీతం : సత్యం
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి:
నా మాటే నీ మాటై చదవాలీ
నేనంటే నువ్వంటూ రాయాలీ
నా మాటే నీ మాటై చదవాలీ
నేనంటే నువ్వంటూ రాయాలీ
అఆ.. ఇఈ.. ఉఊ.. ఎఏ
అఆ.. ఇఈ.. ఉఊ.. ఎఏ
చరణం 1:
మట్టిలో రాసిన రాతలు గాలికి
కొట్టుకుపోతే ఎట్లాగా.. ఎట్లాగా..
మనసున రాసీ మననం చేస్తే
జీవితమంతా ఉంటాయి.. నిలిచుంటాయి..
ఆ మాటే నిజమైతే నేర్పమ్మా ..
మనసంతా రాసేస్తా కోకమ్మ
నా మాటే నీ మాటై చదవాలీ
నేనంటే నువ్వంటూ రాయాలీ
పడవ.. కడవ
చిలక.. పలక
చరణం 2:
ఆహా .. ఆహా .. ఓహో ..ఓహో..
కొండలు కోనలు ఏం చదివాయి
కో అంటే అవి కో అంటాయి
హృదయన్నుండి కదిలాయంటే..
చదువులు చదవకే వస్తాయి.. బదులిస్తాయి
ఆ చదువే నేనింకా చదవాలి..
ఆ బదులే నీ నుంచి రావాలి...
నా మాటే నీ మాటై చదవాలీ
నేనంటే నువ్వంటూ రాయాలీ
అహహా హా హా హా హా
ఆఆ ఆ ఆ ఆ ఆ
ఒహొహో హో హో హో
ఆఆ ఆ ఆ ఆ ఆ
- పాటల ధనుస్సు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి