రాధాకృష్ణుల ప్రణయగీతం:
గీత రచన : రామకృష్ణ దువ్వు,
స్వరకల్పన : చిప్పాడ పవన్ కుమార్ (ప్రవీణ్)
గానం : T కృష్ణ రావు, మూల శ్రీలత,
ఆల్బం : బృందావనం
రికార్డింగ్ : శ్రీ మాత డిజిటల్ రికార్డింగ్, విశాఖపట్నం.
పల్లవి:
రాధ:
కృష్ణా… నా ఊపిరి నీవేరా…
నా కళ్ళు చూసేది నీ రూపమే …
నీ పదముల సవ్వడికే నా హృదయం ఆడేది
కృష్ణ:
రాధికా… నా ఉనికి నీకోసమే..
నీ చూపులే నా నయనాలు..
నా హృదిలో చేతనము నీవే చెలీ..
రాధ, కృష్ణ:
నేనూ నీవూ వేరుగ లేము
జగతిన ఎపుడూ కలసుంటాము..
చరణం 1:
రాధ:
ప్రతి తరువూ మన ప్రేమను చూసి
పరవశించి కమ్మని ఫలముల నిచ్చాయి
కృష్ణ:
రాధాకృష్ణుల జంటగ చూసి
గువ్వలన్ని ప్రేమ పాటలే పాడాయి
రాధ:
నీ మోహనరాగపు పరవశంబున
మబ్బులు ప్రేమ చినుకులు కురిశాయి..
కృష్ణ:
పూదోటలన్నీ స్వాగతించిగ
ప్రేమ సౌరభాలు గుప్పించాయి
రాధ, కృష్ణ:
నీవూ నేనూ జతగా వుంటే
ప్రతి ఆణువణువూ ప్రేమమయం
చరణం 2:
రాధ:
గోపాలా నీ ప్రేమ లో నేను రసరాగిణిని..
నా తనువూ మనసూ పలికేను నీ నామమే
కృష్ణ:
నేనెపుడూ నీ నామమునే స్మరింతు సఖీ..
నీ పదములు తాకిన పుడమి పులకరించును
రాధ:
భువిలో దివిలో ఏ యుగమైనా …
కృష్ణుని సరసన నిలుచును ఈ రాధ…
కృష్ణ:
సుమ సమమైన ప్రియ చరణములు
నా శిరసున దాల్చి తరింతు ప్రేమ మయీ ..
రాధ, కృష్ణ:
నీవూ నేనూ జతగా వుంటే
ప్రతి ఆణువణువూ ప్రేమమయం …
।।కృష్ణ… నా ఊపిరి।।
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి