నీ జిలుగుపైట నీడలోన నిలువని
చిత్రం : పూల రంగడు (1967)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : సి.నారాయణరెడ్డి
నేపధ్య గానం : ఘంటసాల, పి.సుశీల
పల్లవి:
నీ నడుముపైన చేయి వేసి
నడువని... నన్ను నడువని
నీ చేతుల చెరసాలలోన..
చేరని.. నన్ను చేరని
నీ జిలుగుపైట నీడలోన
నిలువని... నన్ను నిలువని
నీ అడుగులోన అడుగువేసి
నడువని... నన్ను నడువని
చరణం 1:
చిక్కని బుగ్గలపై
చిటికెలు వేయని
సన్నని నవ్వులలో
సంపెంగలేరని
గులాబి పెదవులనే..
అలా అలా చూడని
నీ జిలుగుపైట నీడలోన
నిలువని... నన్ను నిలువని
నీ అడుగులోన అడుగులేసి
నడువని...నన్ను నడువని
చరణం 2:
పచ్చిగ తిన్నెలలో
వెచ్చగ సాగని
వెచ్చని వెన్నెలలో
ముచ్చటలాడని
ముచ్చటలాడి ఆడి
మురిసి మురిసి పాడని
నీ జిలుగుపైట నీడలోన
నిలువని... నన్ను నిలువని
నీ అడుగులోన అడుగు వేసి
నడువని.... నన్ను నడువని
చరణం 3:
మబ్బుల వాడలో
మనసులు కూడని
మల్లెల మేడలో
మమతలు పండని
ఆ...ఆ...ఆ...ఆ..ఆ...
మబ్బుల వాడలో
మనసులు కూడని
మల్లెల మేడలో
మమతలు పండని
బంగారు కోవెలలో
కొంగులు ముడివేయని
బంగారు కోవెలలో
కొంగులు ముడివేయని
- పాటల ధనుస్సు

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి