ఏవో మౌన రాగాలు
చిత్రం: పగబట్టిన పడుచు (1971)
సంగీతం: యం. రంగారావు
గీతరచయిత : సి నారాయణ రెడ్డి
నేపధ్య గానం: సుశీల
పల్లవి:
ఓహో....ఓహొ...ఓ..ఓ...ఓ...
ఏవో మౌన రాగాలు...
ఏవో మధుర భావాలు...
నాలో కదలె... ఈ వేళా
ఏవో మౌన రాగాలు...
ఏవో మధుర భావాలు...
నాలో కదలె ...ఈ వేళా
చరణం 1:
తుంటరి వయసేమన్నది...
తూగాడు నడుమేమన్నది
చెరలాడు పైటేమన్నది...
విరహాలు ఇక చాలన్నది
తుంటరి వయసేమన్నది...
తూగాడు నడుమేమన్నది
చెరలాడు పైటేమన్నది...
విరహాలు ఇక చాలన్నది
రారా ఓ చెలికాడా...
వలపే నీదేరా...నీదేలేరా
ఏవో మౌన రాగాలు...
ఏవో మధుర భావాలు
నాలో కదలె ఈవేళా..
చరణం 2:
మాధవుడందని రాధనై...
ఆ రాధ తియ్యని బాధనై
ఆ బాధ మోయని గాధనై...
ఇన్నాళ్ళు జాలిగ తిరిగేను
మాధవుడందని రాధనై...
ఆ రాధ తియ్యని బాధనై
ఆ బాధ మోయని గాధనై...
ఇన్నాళ్ళు జాలిగ తిరిగేను..
రారా ఓ చెలికాడా...
నేనే ఆ రాధనురా...నీ రాధనురా
ఏవో మౌన రాగాలు...
ఏవో మధుర భావాలు..
నాలో కదలె ఈవేళా...
- పాటల ధనుస్సు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి