మదనా మనసాయెరా
చిత్రం : పూజాఫలం (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : సి.నారాయణరెడ్డి
నేపధ్య గానం : ఎస్. జానకి
పల్లవి:
ఓ..ఓ..ఓ..మదనా మనసాయెరా...
పరువము పొంగే తరుణము నేడే
మరి మరి నీకై రాబోదురా...
మదనా.... మనసాయెరా....
చరణం 1:
ఆ..ఆ..
సుందరి మధువై ముందు నిలిచెరా
నీ.. ముందు నిలిచెరా..ఆ..
అందిన పెన్నిధి అనుభవించరా..ఆ..
కలువను మీరే చెలువను చేరె ...
కలువను మీరే చెలువను చేరె ..
వలపును తూచే వేళయెరా ...
మదనా మనసాయెరా ...
పరువము పొంగే తరుణము నేడే ...
మరి మరి నీకై రాబోదురా...
మదనా... మనసాయెరా...
- పాటల ధనుస్సు
