నడిరేయి ఏ జాములో
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : ఘంటసాల, జానకి
పల్లవి :
నడిరేయి ఏ జాములో..
స్వామి నిను చేర దిగివచ్చునో
తిరుమల శిఖరాలు దిగివచ్చునూ...
నడిరేయి ఏ జాములో..
స్వామి నిను చేర దిగివచ్చునో
తిరుమల శిఖరాలు దిగివచ్చునూ
చరణం 1 :
మముగన్న మాయమ్మ
అలివేలు మంగమ్మ
మముగన్న మాయమ్మ
అలివేలు మంగమ్మ
పతి దేవు ఒడిలోన
మురిసేటివేళా
స్వామి చిరునవ్వు వెన్నెలలు
కురిసేటివేళా
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా
చరణం 2 :
ఏడెడు శిఖరాలు నే నడువలేను ..
ఏ పాటి కానుకలందించలేను
వెంకన్న పాదాలు దర్శించలేను...
నేను వివరించి నా బాధ వినిపించలేను
అమ్మా..ఆ..ఆ..ఆ.. మము గన్న
మాయమ్మా అలివేలుమంగా
మము గన్న మాయమ్మా అలివేలుమంగా
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా
చరణం 3 :
కలవారినేగాని కరుణించలేడా..
నిరుపేద మొరలేవి వినిపించుకోడా
కన్నీటి బ్రతుకుల కనలేనినాడు..
స్వామి కరుణామయుండన్నా
బిరుదేలనమ్మా
అడగవే మా తల్లి అనురాగ వల్లి ..
అడగవె మాయమ్మ అలివేలుమంగా
నడిరేయి ఏ జాములో..
స్వామి నిను చేర దిగివచ్చునో
తిరుమల శిఖరాలు దిగివచ్చునూ...
- పాటల ధనుస్సు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి