తొలిసారి నిన్నూ చూశాను నేను
చిత్రం: దేవుడు చేసిన మనుషులు (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం: బాలు
పల్లవి:
ఊ...ఊ...ఊ..హా..ఊ..
లా..అహా...ఆ
తొలిసారి నిన్నూ చూశాను నేను..
నీ ప్రేమ పాశం లాగింది నన్నూ..
లాగింది నన్నూ...
ఏ తారలోనూ నీ తీరూ లేదు..
ఏ పువ్వులోనూ నీ నవ్వు లేదు..
లేదు..లేదు
చరణం 1:
నీ బుగ్గమీద మొగ్గ వేయు నిగ్గు చూసి..
తాజా గులాబి సిగ్గుతో తలవంచె చూడు
నీ బుగ్గమీద మొగ్గ వేయు నిగ్గు చూసి..
తాజా గులాబి సిగ్గుతో తలవంచె చూడు
ఏ తారలోనూ నీ తీరూ లేదు..
ఏ పువ్వులోనూ నీ నవ్వు లేదు..
లేదు..లేదు
చరణం 2:
నీ చక్కనైన మేనులోని ఛాయ జూసీ..
చిన్నారి కన్నె చేమంతి చిన్నబోయె నేడు
ఏ తారలోనూ నీ తీరూ లేదు..
ఏ పువ్వులోనూ నీ నవ్వు లేదు..
లేదు..లేదు..
చరణం 3:
ఏ సుందరిలో కానరాని సోయగాలు..
ఏ వయ్యారిలో లేని అందచందాలూ
ఏ సుందరిలో కానరాని సోయగాలు..
ఏ వయ్యారిలో లేని అందచందాలూ..
తనలోన కలిగి..మనసార వలచే..
చినదానికోసం వెతికేను నేను..
నేను..నేను
- పాటల ధనుస్సు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి